ఆదోనిలో దారుణం: పెట్రోల్ పోసి మహిళకు నిప్పు.!

కర్నూలు జిల్లా: ఆదోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మున్సిపల్ ఉద్యోగిని నరసమ్మపై మహిళల బృందం దాడి చేసింది. దాడి చేసిన వారు మొదట ఆమె కళ్లలో కారం చల్లి, ఆ తర్వాత ఆమెపై పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నరసమ్మ ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతూ చికిత్స పొందుతోంది.

నరసమ్మ తన ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్న వితంతువు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

author

Rrrr

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE